Wednesday 26 November 2014

ఉత్కంఠభరితంగా కోడిపోరు

ఉత్కంఠభరితంగా కోడిపోరు

ఉత్కంఠభరితంగా కోడిపోరు
పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో ప్రధాన ఘట్టమైన కోడిపోరు వీరులగుడి ఆవరణలో జరిగింది. పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ తదితరులు బ్రహ్మనాయుడు పక్షాన చిట్టిమల్లు పుంజును, నాగమ్మ వేషంలో ఉన్న ఆచారవంతుడు ముక్కంటి తదితరులు నాగమ్మ పక్షాన శివంగిడేగను పందేనికి వదిలారు. వీరవిద్యావంతులు కృష్ణమూర్తి, నరసింహ, చిన్నప్ప కోడిపోరు క థాగానాన్ని ఆలపించారు.



 కోడిపోరు ఉత్కంఠభరింతంగా పాగింది. చివరికి నాగమ్మ కోడి శింగిడేగ పోటి విజేతగా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా  13 జిల్లాల్లో ఉన్న వీరాచారవంతులు పల్నాటి ఉత్సవాలకు తరలివచ్చి కోడిపోరు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేలాదిగా వీరాచారవంతులు, తిరునాళ్లకు వచ్చిన జనం కోడిపోరు ను వీక్షించారు.
ఎమ్మెల్యేలు యరపతినేని, జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్సీ రాయపాటి శ్రీనివాస్  వీరులగుడిలో పూజలు జరిపి కోడిపోరు ఉత్సవంలో పాల్గొన్నారు.

No comments:

Post a Comment