Friday 29 July 2016

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య ( kavuri Venkaiah )

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య


గాంధీయవాదిగా నిరూపించుకున్న కావూరి వెంకయ్య పల్నాటి సీమలోని బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యదేవుడు. కొండ కోనల్లోని గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలను చేరదీసి వారిని విద్యాపరంగా అభివ`ద్ది చేసిన ఘనత వారికే దక్కింది. మారుమూల గ్రామల్లొని విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లును ఏర్పాటు చేశారు. హాస్టళ్ల నిర్వాహన కొరకు గ్రామగ్రామాన తిరిగి పప్పు ధాన్యాలు, నిత్యవసర వస్తువులు సేకరించి విద్యార్థులకు బోజన ఏర్పాట్లు చేసేవారు. మాచర్లలో చెంచుబాలికల హాస్లళ్లు, కళామందిర్ సెంటర్ లోని చిన్నకాన్వెంట్ కు స్థలాన్ని ఇచ్చారు. నాగార్జనసాగర్ లో చెంచు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు గురజాలలో హయ్యర్ గ్రేడు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో పల్నాడులోని బాలబాలికలు దీనిలో శిక్షణ పొంది ఉపాధి పొందారు. కరువు సీమలో విధ్యాభివ`ద్దికి బాటలు వేసిన వెంకయ్య పల్నాటి విద్యాధాతగా వినుతినెక్కారు. మాచర్ల, గురజాల, కారంపూడి, పిడుగురాళ్ల, నాగార్జునసాగర్, కొత్తపుల్లారెడ్డి గూడెం, అలుగురాసుపల్లె తదితర గ్రామాలలో పాఠశాలల ద్వారా పేదవారికి విద్యాదానం చేశారు.

ప్రముఖులతో పరిచయం..

కావూరివెంకయ్య కి ఆనాటి ఎందరో ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆ పరిచయం తో
ఆచార్య రంగా, గొళ్లపూడి సీతారామశాస్త్రి, గొపరాజు రామచంద్రరావు(గోరా)లను ఆహ్వానించి వారిచే విద్యార్థులకు సందేశాలు ఇప్పించేవారు. బూర్గుల రామక`ష్ణారావు, మర్రి చెన్నరెడ్డి, వల్లూరి బసవరాజు, కొండవీటి వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు నేతలు వెంకయ్యగారి ఆశ్రయంలో గడిపి విధ్యార్థులకు తమ అమూల్య సందేశాలు ఇచ్చేవారు. వావిరాల గోపాలక`ష్ణయ్య తరుచూ వెంకయ్యగారి ఆశ్రమాన్ని సందర్శించి వారి క`షిని అభినందించేవారు. చదువుల వాసన ఎరగని మారుమూల అట్టడుగు పిల్లలను వెలుగులోెకి తెచ్చి వారికి విద్యను అందించారు. ఈయన పాఠశాలల్లో చదివిన ఎందరో విధ్యార్థులు గొప్పగొప్ప ఉద్యోగాలలో ఉన్నారు. ఇప్పటికి ఆయా కుంటుంబాల వారు వెంకయ్య పేరు చెప్పుకొని ఇంటి దీపం పెట్టుకుంటారు. వెంకయ్య అక్షరాల సోషలిస్టు. అందుకే ఆయన నిర్వహించిన పాఠశాలలు, హాస్లళ్లు భవనాలు, స్థలాలు ప్రభుత్వ పరం చేశారు. మాచర్ల ప్రస్తుతం నడుస్తున్న ఆర్ సీ ఎం పాఠశాలను ఆనాడు భననాలతో సహా యాజమాన్యానకి విరాళం అందించారు. విద్యాలయాలుగా ఉన్న స్వంత భవనాలను కూడా ఉచితం ప్రభుత్వ పరం చేసిన త్యాగ ధనుడు వెంకయ్యగారు. 1940 సత్యాగ్రహి, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్లోని జైలు జీవితం గడిపారు. గాంధీజి పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని పల్నాటి కి వెలలేని కీర్తని తీసుకొచ్చారు.