Thursday 8 December 2016

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

పల్నాటి రాజ్యం కోడిపోరులో.  మాచర్లను  ఏలు బ్రహ్మనాయుని నేతృత్యంలో మలిదేవాదులు, గురజాలను పరిపాలించే నలగామరాజు, మంత్రి నాగమ్మ చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయగా. మహా భారతంలో పాండవులు ధర్మరాజు నేతృత్వంలో, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవటంతో వనవాసం చేయాల్సి వచ్చింది. దీంతో భారతంలోని ఘటనలు. పల్నాటి సంఘటనలు సామరూప్యతక కల్గివుండటంతో. అందుకే దీనిని పల్నాటి మినీ భారతం" గా అభివర్ణించారు. పౌరుషాల పురిటి గడ్డగా ఖ్యాతి గడించిన పల్నాడులో నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..
అల నాడు మాచర్ల రాజు మలిదేవని సైన్యంలోని అలరాజుకు గురజాల రాజు నలగాముడి కుమార్తెను ఇచ్చి వివాహం సందర్భంలో సరదాగా కోడి పందేలు సాగాయి. ఇది పంతాలకు దారి తీసి నిజమైన కోడిపోరుకు ముహూర్తం ఖరారవుతుంది, దీంతో రెంచింతల మండలంలోని పాలు వాయి వద్ద గల పాడేరు గుట్టల్లో కోడిపోరు నిర్ణయిం చారు. దీంతో గురజాల, మాచర్ల రాజ్యాల్లో పందెపు కోళ్లన్నీ నాగమ్మ కొనేసిన క్రమంలో దేవానుగ్రహంతో బ్రహ్మన్న చిట్టిమల్ల అనే కోడిని సాధిస్తాడు. నిర్ణయిం చిన ప్రకారం కోడిపోరు మొదలవగా రెండుసార్లు బ్రహ్మన్న పంజు పోటీల్లో గెలుపొందుతుంది. దీంతో ఆగ్రహించిన నాగమ్మ మంత్రకట్టు తో   బ్రహ్మన్న కోడి చిట్టి మల్లను నిర్వీర్యం చేసి గురజాల కోడైన సేవంగి డేగ పోరులో గెలిచేలా చేస్తుంది. ఓడిన బ్రహ్మన్న సారథ్యం లోని మాచర్ల రాజులు మలిదేవాదులు అరణ్యవాసం అనుభవిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Wednesday 7 December 2016

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మంద' పోరు'

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు



కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలావున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టిం ది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామరాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామరాజు అంగీకరించకపోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభపడతారు.దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రిదాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు,పల్లన్నమల్లన్నఅనేవేగులద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడిచేసేందుకు వ్యూహం పన్నుతారు.ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు. వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్నిహతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటంచేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలోకల్గివుండా నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేలకొరుగుతారు. ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్నపెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి  తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామ రాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Saturday 3 December 2016

అలరాజు రాయబారం వికటించుటయే.. పల్నాటి యుద్దానికి బీజం.!

అలరాజు రాయబారం వికటించుటయే
పల్నాటి యుద్దానికి బీజం.!





మాచర్లను పరిపాలిస్తున్న బ్రహ్మనాయుడు నేతృత్వంలోని మలిదేవాదులు తమ ప్రాంతాన్ని  అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజును కోరుటకు గాను అలరాజును " (రాయభారం)రి" పంపగా అది కాస్త వికటించటంతోనే పల్నాటి యుద్దానికి తొలి బీజం పడిందని చారిత్రక ఇతి వృత్తాంతం.
మలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందసుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రహ్మనాయుని అనూయులు రాజ్యం వదలి ఏడు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని మేడపి ( ప్రకాశం జిల్లా )లో  వుంటున్నారు. గడువు తీరి ఆరునెల కావటంతో రాజ్యాన్ని తిరిగి పొందేందుకు గాను నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త "అలరాజు" ను గురజాలకు బ్రహ్మనాయుడు "రాయభారం" పంపుతాడు. అలరాజును  రాయభారం పంపే సమయంలో అతని తల్లి  బ్రహ్మనాయునితో  వీరాగ్రేసులైన పెద బాలరాజునుగాని, నీ మాసన పత్రుడైన సర్వసైనాధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రుడ్నిగాని పంపంవచ్చగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును, దుర్మాగమును తెలిసి కూడా ధర్మం పేరిట న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా కన్నమదాసు ను పంపటమే కాకుండా మహీన్వితమేన 'తులసి మాలను వేసి గురజాలకు రాయభారం వంపుతానని బ్రహ్మనాయుడు తెలపటంతో అలరాజు తల్లి వెళ్ళేందుకు అంగీకరిసుంది. రాయభారమునకు వెళ్ళిన వారు మార్గమధ్యలో కందేరు వాగు దాటవలసివస్తుంది. ఆ మార్గంలోనే బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఆ ఇరువరు ఏరు దాటువిషయంలో సరదాగా పందేం కాసారు. ఓడిన వారు నిలువ దోపిడి గావించాలని షరతు. పందేంలో అలరాజు ఓడిపోవుటతో నిలువ దోపిడిగా అన్ని అభరణములతో పాటు తులసిమాలను కూడా తీసాడు. తదుపరి అలంకరణ పూర్తి చేసుకొనిన అలరాజు తులసిమాలను మర్చిపోయి గురజాలకు బయలుదేరుతారు. 'నరసింగరాజు" నాగమ్మలు దౌత్యమునకు సహకరించకపోగా "సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని నలగామరాజు క్రోపోద్రేకము వ్యక్తం చేస్తాడు. దీంతో సహనానికి విలువలేకుండా పోయింది. పల్నాట రక్తము ఏరులై పారవలసిందే నంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తూన్నాను సిద్దంకండీ. విజయమో. వీరస్వర్గమో. తెల్చుకుందాం...! అని తన "సూర్య భేతాళ ఖడ్గము" ను తీసి వీరావేశమును ప్రదర్శించేను. రాయబారిగా వచ్చాన్నవిషయం గురు_కువచ్చి ఎత్తిన ఖడ్గమును దించకూడదన్న నియమము చేత సభలోని స్తంభమును తెగనరికి వెను తిరుగుతారు. మార్గ మధ్యలో చర్లగుడిపాడు సమీపాన నాయకురాలు నాగమ్మ కుతంత్రంములతో తంబళ్ళజీయర్ ద్వారా అలరాజును విష ప్రయోగం చేత చంపిస్తుంది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధ ఆసన్నమైందని ప్రకటన  చేస్తారని చారిత్రక కధనం.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra