Saturday 3 December 2016

అలరాజు రాయబారం వికటించుటయే.. పల్నాటి యుద్దానికి బీజం.!

అలరాజు రాయబారం వికటించుటయే
పల్నాటి యుద్దానికి బీజం.!





మాచర్లను పరిపాలిస్తున్న బ్రహ్మనాయుడు నేతృత్వంలోని మలిదేవాదులు తమ ప్రాంతాన్ని  అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజును కోరుటకు గాను అలరాజును " (రాయభారం)రి" పంపగా అది కాస్త వికటించటంతోనే పల్నాటి యుద్దానికి తొలి బీజం పడిందని చారిత్రక ఇతి వృత్తాంతం.
మలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందసుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రహ్మనాయుని అనూయులు రాజ్యం వదలి ఏడు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని మేడపి ( ప్రకాశం జిల్లా )లో  వుంటున్నారు. గడువు తీరి ఆరునెల కావటంతో రాజ్యాన్ని తిరిగి పొందేందుకు గాను నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త "అలరాజు" ను గురజాలకు బ్రహ్మనాయుడు "రాయభారం" పంపుతాడు. అలరాజును  రాయభారం పంపే సమయంలో అతని తల్లి  బ్రహ్మనాయునితో  వీరాగ్రేసులైన పెద బాలరాజునుగాని, నీ మాసన పత్రుడైన సర్వసైనాధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రుడ్నిగాని పంపంవచ్చగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును, దుర్మాగమును తెలిసి కూడా ధర్మం పేరిట న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా కన్నమదాసు ను పంపటమే కాకుండా మహీన్వితమేన 'తులసి మాలను వేసి గురజాలకు రాయభారం వంపుతానని బ్రహ్మనాయుడు తెలపటంతో అలరాజు తల్లి వెళ్ళేందుకు అంగీకరిసుంది. రాయభారమునకు వెళ్ళిన వారు మార్గమధ్యలో కందేరు వాగు దాటవలసివస్తుంది. ఆ మార్గంలోనే బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఆ ఇరువరు ఏరు దాటువిషయంలో సరదాగా పందేం కాసారు. ఓడిన వారు నిలువ దోపిడి గావించాలని షరతు. పందేంలో అలరాజు ఓడిపోవుటతో నిలువ దోపిడిగా అన్ని అభరణములతో పాటు తులసిమాలను కూడా తీసాడు. తదుపరి అలంకరణ పూర్తి చేసుకొనిన అలరాజు తులసిమాలను మర్చిపోయి గురజాలకు బయలుదేరుతారు. 'నరసింగరాజు" నాగమ్మలు దౌత్యమునకు సహకరించకపోగా "సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని నలగామరాజు క్రోపోద్రేకము వ్యక్తం చేస్తాడు. దీంతో సహనానికి విలువలేకుండా పోయింది. పల్నాట రక్తము ఏరులై పారవలసిందే నంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తూన్నాను సిద్దంకండీ. విజయమో. వీరస్వర్గమో. తెల్చుకుందాం...! అని తన "సూర్య భేతాళ ఖడ్గము" ను తీసి వీరావేశమును ప్రదర్శించేను. రాయబారిగా వచ్చాన్నవిషయం గురు_కువచ్చి ఎత్తిన ఖడ్గమును దించకూడదన్న నియమము చేత సభలోని స్తంభమును తెగనరికి వెను తిరుగుతారు. మార్గ మధ్యలో చర్లగుడిపాడు సమీపాన నాయకురాలు నాగమ్మ కుతంత్రంములతో తంబళ్ళజీయర్ ద్వారా అలరాజును విష ప్రయోగం చేత చంపిస్తుంది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధ ఆసన్నమైందని ప్రకటన  చేస్తారని చారిత్రక కధనం.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

No comments:

Post a Comment