Thursday 8 December 2016

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

పల్నాటి రాజ్యం కోడిపోరులో.  మాచర్లను  ఏలు బ్రహ్మనాయుని నేతృత్యంలో మలిదేవాదులు, గురజాలను పరిపాలించే నలగామరాజు, మంత్రి నాగమ్మ చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయగా. మహా భారతంలో పాండవులు ధర్మరాజు నేతృత్వంలో, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవటంతో వనవాసం చేయాల్సి వచ్చింది. దీంతో భారతంలోని ఘటనలు. పల్నాటి సంఘటనలు సామరూప్యతక కల్గివుండటంతో. అందుకే దీనిని పల్నాటి మినీ భారతం" గా అభివర్ణించారు. పౌరుషాల పురిటి గడ్డగా ఖ్యాతి గడించిన పల్నాడులో నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..
అల నాడు మాచర్ల రాజు మలిదేవని సైన్యంలోని అలరాజుకు గురజాల రాజు నలగాముడి కుమార్తెను ఇచ్చి వివాహం సందర్భంలో సరదాగా కోడి పందేలు సాగాయి. ఇది పంతాలకు దారి తీసి నిజమైన కోడిపోరుకు ముహూర్తం ఖరారవుతుంది, దీంతో రెంచింతల మండలంలోని పాలు వాయి వద్ద గల పాడేరు గుట్టల్లో కోడిపోరు నిర్ణయిం చారు. దీంతో గురజాల, మాచర్ల రాజ్యాల్లో పందెపు కోళ్లన్నీ నాగమ్మ కొనేసిన క్రమంలో దేవానుగ్రహంతో బ్రహ్మన్న చిట్టిమల్ల అనే కోడిని సాధిస్తాడు. నిర్ణయిం చిన ప్రకారం కోడిపోరు మొదలవగా రెండుసార్లు బ్రహ్మన్న పంజు పోటీల్లో గెలుపొందుతుంది. దీంతో ఆగ్రహించిన నాగమ్మ మంత్రకట్టు తో   బ్రహ్మన్న కోడి చిట్టి మల్లను నిర్వీర్యం చేసి గురజాల కోడైన సేవంగి డేగ పోరులో గెలిచేలా చేస్తుంది. ఓడిన బ్రహ్మన్న సారథ్యం లోని మాచర్ల రాజులు మలిదేవాదులు అరణ్యవాసం అనుభవిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

No comments:

Post a Comment