Thursday 8 December 2016

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

పల్నాటి రాజ్యం కోడిపోరులో.  మాచర్లను  ఏలు బ్రహ్మనాయుని నేతృత్యంలో మలిదేవాదులు, గురజాలను పరిపాలించే నలగామరాజు, మంత్రి నాగమ్మ చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయగా. మహా భారతంలో పాండవులు ధర్మరాజు నేతృత్వంలో, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవటంతో వనవాసం చేయాల్సి వచ్చింది. దీంతో భారతంలోని ఘటనలు. పల్నాటి సంఘటనలు సామరూప్యతక కల్గివుండటంతో. అందుకే దీనిని పల్నాటి మినీ భారతం" గా అభివర్ణించారు. పౌరుషాల పురిటి గడ్డగా ఖ్యాతి గడించిన పల్నాడులో నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..
అల నాడు మాచర్ల రాజు మలిదేవని సైన్యంలోని అలరాజుకు గురజాల రాజు నలగాముడి కుమార్తెను ఇచ్చి వివాహం సందర్భంలో సరదాగా కోడి పందేలు సాగాయి. ఇది పంతాలకు దారి తీసి నిజమైన కోడిపోరుకు ముహూర్తం ఖరారవుతుంది, దీంతో రెంచింతల మండలంలోని పాలు వాయి వద్ద గల పాడేరు గుట్టల్లో కోడిపోరు నిర్ణయిం చారు. దీంతో గురజాల, మాచర్ల రాజ్యాల్లో పందెపు కోళ్లన్నీ నాగమ్మ కొనేసిన క్రమంలో దేవానుగ్రహంతో బ్రహ్మన్న చిట్టిమల్ల అనే కోడిని సాధిస్తాడు. నిర్ణయిం చిన ప్రకారం కోడిపోరు మొదలవగా రెండుసార్లు బ్రహ్మన్న పంజు పోటీల్లో గెలుపొందుతుంది. దీంతో ఆగ్రహించిన నాగమ్మ మంత్రకట్టు తో   బ్రహ్మన్న కోడి చిట్టి మల్లను నిర్వీర్యం చేసి గురజాల కోడైన సేవంగి డేగ పోరులో గెలిచేలా చేస్తుంది. ఓడిన బ్రహ్మన్న సారథ్యం లోని మాచర్ల రాజులు మలిదేవాదులు అరణ్యవాసం అనుభవిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Wednesday 7 December 2016

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మంద' పోరు'

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు



కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలావున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టిం ది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామరాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామరాజు అంగీకరించకపోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభపడతారు.దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రిదాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు,పల్లన్నమల్లన్నఅనేవేగులద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడిచేసేందుకు వ్యూహం పన్నుతారు.ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు. వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్నిహతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటంచేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలోకల్గివుండా నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేలకొరుగుతారు. ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్నపెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి  తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామ రాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Saturday 3 December 2016

అలరాజు రాయబారం వికటించుటయే.. పల్నాటి యుద్దానికి బీజం.!

అలరాజు రాయబారం వికటించుటయే
పల్నాటి యుద్దానికి బీజం.!





మాచర్లను పరిపాలిస్తున్న బ్రహ్మనాయుడు నేతృత్వంలోని మలిదేవాదులు తమ ప్రాంతాన్ని  అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజును కోరుటకు గాను అలరాజును " (రాయభారం)రి" పంపగా అది కాస్త వికటించటంతోనే పల్నాటి యుద్దానికి తొలి బీజం పడిందని చారిత్రక ఇతి వృత్తాంతం.
మలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందసుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రహ్మనాయుని అనూయులు రాజ్యం వదలి ఏడు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని మేడపి ( ప్రకాశం జిల్లా )లో  వుంటున్నారు. గడువు తీరి ఆరునెల కావటంతో రాజ్యాన్ని తిరిగి పొందేందుకు గాను నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త "అలరాజు" ను గురజాలకు బ్రహ్మనాయుడు "రాయభారం" పంపుతాడు. అలరాజును  రాయభారం పంపే సమయంలో అతని తల్లి  బ్రహ్మనాయునితో  వీరాగ్రేసులైన పెద బాలరాజునుగాని, నీ మాసన పత్రుడైన సర్వసైనాధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రుడ్నిగాని పంపంవచ్చగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును, దుర్మాగమును తెలిసి కూడా ధర్మం పేరిట న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా కన్నమదాసు ను పంపటమే కాకుండా మహీన్వితమేన 'తులసి మాలను వేసి గురజాలకు రాయభారం వంపుతానని బ్రహ్మనాయుడు తెలపటంతో అలరాజు తల్లి వెళ్ళేందుకు అంగీకరిసుంది. రాయభారమునకు వెళ్ళిన వారు మార్గమధ్యలో కందేరు వాగు దాటవలసివస్తుంది. ఆ మార్గంలోనే బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఆ ఇరువరు ఏరు దాటువిషయంలో సరదాగా పందేం కాసారు. ఓడిన వారు నిలువ దోపిడి గావించాలని షరతు. పందేంలో అలరాజు ఓడిపోవుటతో నిలువ దోపిడిగా అన్ని అభరణములతో పాటు తులసిమాలను కూడా తీసాడు. తదుపరి అలంకరణ పూర్తి చేసుకొనిన అలరాజు తులసిమాలను మర్చిపోయి గురజాలకు బయలుదేరుతారు. 'నరసింగరాజు" నాగమ్మలు దౌత్యమునకు సహకరించకపోగా "సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని నలగామరాజు క్రోపోద్రేకము వ్యక్తం చేస్తాడు. దీంతో సహనానికి విలువలేకుండా పోయింది. పల్నాట రక్తము ఏరులై పారవలసిందే నంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తూన్నాను సిద్దంకండీ. విజయమో. వీరస్వర్గమో. తెల్చుకుందాం...! అని తన "సూర్య భేతాళ ఖడ్గము" ను తీసి వీరావేశమును ప్రదర్శించేను. రాయబారిగా వచ్చాన్నవిషయం గురు_కువచ్చి ఎత్తిన ఖడ్గమును దించకూడదన్న నియమము చేత సభలోని స్తంభమును తెగనరికి వెను తిరుగుతారు. మార్గ మధ్యలో చర్లగుడిపాడు సమీపాన నాయకురాలు నాగమ్మ కుతంత్రంములతో తంబళ్ళజీయర్ ద్వారా అలరాజును విష ప్రయోగం చేత చంపిస్తుంది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధ ఆసన్నమైందని ప్రకటన  చేస్తారని చారిత్రక కధనం.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Monday 14 November 2016

పల్నాటి వీరారాధన ఉత్సవాలకు శ్రీకారం, కారంపూడి. (2016) ( veeraradhana uttav) karempudi

పల్నాటి వీరారాధన ఉత్సవాలకుశ్రీకారం(2016)


కారంపూడి పల్నాటి వీరారాధన ఉత్సవాలకు పల్నాటి వీరాచార పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ కార్తీక పౌర్ణమి సోమ వారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరుల గుడి ఆవర ణలో ఉన్న పోతురాజుకు పూలమాల వేశారు. ఉత్స వాలు పూర్తయ్యే వరకు గుడిని వీడి వెళ్లవద్దని పోతురాజుకు 101 పోగులతో ఆనకట్టు కట్టే ప్రక్రియ నిర్వహించారు. మొదట చెన్నకేశవస్వామి ఆలయంలో బ్రహ్మనాయుడు ఆయుధం నృసింహకుంతం, వివిధ గ్రామాల నుంచి వచ్చిన మరో ఏడు వీరుల ఆయుధా శుభ్రపరిచిన అనంతరం అలం కారాలు చేసి గ్రామోత్సవం చేశారు. అంకాళమ్మ గుడి ముఖ ద్వారానికి ఏర్పాటు చేసిన జ్వాలా తోరణం గుండా వీరుల ఆయు ధాలను గుడిలోకి తీసుకెళ్లారు. అనంతరం చెన్నకేశస్వామికి పూజలు చేసి బ్రహ్మనాయుడు విగ్రహం వద్ద వీరంగం వేశారు. అనంతరం పీఠాధిపతితో కలసి వీరులగుడికి చేరుకుని బ్రహ్మనాయుడు నృరసింహకుంతాన్ని పోతు రాజుకు అభిముఖంగా ఉంచి పడిగెం కట్టారు. 28 నుంచి పల్నాటి వీరారాధనోత్సవాలు ఈ ప్రక్రియతో ఉత్సవాల నిర్వహణ సన్నా హాలకు శ్రీకారం చుట్టామని, ఉత్సవాల్లో పాల్గొనవలసిందిగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పల్నాటి వీరాచార, వీర విద్యావంతులకు వర్త మానాలు పంపుతామని పీఠాధిపతి చెప్పారు. ఉత్సవాలు కార్తీక అమావాస్య నవంబరు 28 నుంచి ఐదు రోజులపాటు జరుగుతాయని తెలిపారు. 28న రాచగావు. 29న రాయబారం, 30న మందపోరు(బ్రహ్మనాయుడు చాప కూడు సిద్దాంతం అమలు), డిసెంబరు 1న కోడిపోరు, 2న కళ్లిపాడు పేర్లతో ఉత్సవాలు నిర్వహిస్తామని వెల్లడించారు.

► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra


వీరారాధన ఉత్సవాలు, కారెంపూడి ( Veeraradhna utsav , karempudi)

వీరారాధన ఉత్సవాలు ,  కారెంపూడి


ఈ నెల 28 న  కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి.
పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ధి కోసం కారంపూడిలో వీరాచారపీఠము స్థాపించి దాని పీఠాధిపతులుగా పిడుగు వంశం వారిని నియమించారు. అప్పటి నుంచి పల్నాటి వీరోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణిమి నాడు బ్రహ్మనాయుని న`సింహకుంతము, బాలచంద్రుని సామంతము, కన్నమదాసు భైరవఖడ్గములతో కొంతములను తీసికొని నాగులేరు లో శుభ్రం చేసి, అలంకరణలో గ్రమోత్సవం జరుపుతారు.
ప్రతి ఏడాది కార్తిక మాసం లో పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. ఇది 800 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఆచారం . ఈ నెల 28 కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వం అపాదించి వారికి గుడిలు కట్టి వారు ఉపయోగించిన ఆయుధాలు ను పూజించటం అనే సాంప్రదాయం భారతదేశంలో ఒక్క పల్నాడు ప్రాంతం లోనే జరుగుతుంది. వీర్ల సేవాస్థానములుపోతురాజుకు పిడిగెం కట్టడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కార్తీక అమావాస్య నుంచి వరుసగా ఐదు రోజులు.. రాచగావు, రాయబారం, మందపోటు, కోడిపోరు, కల్లిపాడు అను పేర్లతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే గాగ ఇతర రాష్ట్రాలు నుంచి వీరాచార వంతులు తరలివస్తారు. వీర విద్యావంతులు శ్రీనాధని పల్నాటి వీర చరిత్రను ఈ ఐదు రోజుల పాటు గానం చేస్తారు.

► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Sunday 13 November 2016

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

నాయకురాలు నాగమ్మ ( Nayakuralu Nagmma )

సమకాలీన శాసనాలు, సాహిత్యం, జానపద సాహిత్య ఆధారాలనూ సమన్వయ పరచి అధ్యయనం చేసినప్పుడు నాయకురాలు నాగమ్మ అనే భారతదేశపు ప్రప్రథమ మంత్రిణి కరీంనగర్ జిల్లా పెగడపల్లి మండలం ఆరెవెల్లి గ్రామస్తురాలని, ఆమె కాలం నుండే తెలంగాణాలో “రెడ్డి” అనే కులం ప్రవేశించిందని అర్థమవుతుంది. ఇవి ఇప్పటి వరకు తెలంగాణా చరిత్రకు కొత్త విషయాలు కాబట్టి వీటిని విపులీకరించే ప్రయత్నమే ఈ వ్యాస ఉద్దేశ్యం

శ్రీనాథుడు తన “పల్నాటి యుద్ధం” కావ్యంలో నాగమ్మను

“పంటరెడ్డివారి పణతి యనంగ

ఎలమి జగ్గారెడ్డి వేడుక పుత్రి

మేకపోతుల రెడ్డి మేనకోడలును

ఆరవెల్లి వారింటి అమర కోడలును”

అంటూ వర్ణించాడు. నాగమ్మది .పంటరెడ్డి కుటుంబం. అంటే ఆమె కులపు ప్రధాన వృత్తి పంటలు పండించడం అనేది సుస్పష్టం. ఆమె చేసిన పల్నాటి యుద్ధానికి మూలాలు పంటలకు సంబంధించినవి అనేది ఆమె రాజు నలగామరాజు తండ్రి అనుగురాజు పూర్వ చరిత్ర ద్వారా తెలుస్తుంది. అనుగురాజు ఉత్తర దేశపు బాలమాచాపురి లేదా జంభూపురి (నేటి జబల్పూర్) నుంచి దక్షిణ దేశ యాత్రకు వచ్చి గుంటూరు జిల్లాలోని పల్నాడులోని గురజాలలో స్థిరపడి అక్కడి నుండే రాజ్యపాలన చేస్తుంటాడు. అతని (రాజ్యపు) పశువులకు పశుగ్రాసం అవసరమయ్యి” అతని సేనాపతి తెప్పలినాయుని ఆధ్వర్యంలో భటులు నేటి కరీంనగర్ ఉత్తర ప్రాంతానికి వస్తారు. ఆ రోజుల్లో (ఈ రోజుల్లో కూడా) ప్రధాన పశుగ్రాసం చొప్ప. ఈ జొన్నచొప్ప దండిగా దొరికే ప్రాంతం చొప్పదండి. ఇది కరీంనగర్ కు 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెప్పలినాయుని మందీమార్బలం తమకు కావలసినంత పశుగ్రాసాన్ని సేకరించాక ఆ జొన్న చొప్ప కంకులను చూసి మురిసిపోయి ఒక పంట రెడ్డిని వాటి విత్తనాలను తమకు ఇవ్వుమంటారు- తమ ప్రాంతంలో ఆ పంటను, పశుగ్రాసాన్ని పండించుకోవడానికి. అందుకు ఆ రెడ్డి నిరాకరించడంతో అనుగురాజు సైన్యానికి, స్థానిక Nagamma Sరాజు ఊరకోట ప్రభువు పేరమరాజు సైన్యానికి మధ్య ఆరణిగండ్లలో పెద్ద యుద్ధం జరుగుతుంది. ఈ ఆరణిగండ్లనే నేడు ఆర్నగొండ అని పిలుస్తున్నారు. ఇది చొప్పదండికి ఉత్తరాన 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. అర్నగొండ, గుండిల మధ్య యుద్ధ వ్యూహాలను రచించుకోవడానికి అనువైన కొండలు, గుండ్లు, మైదానాలు ఉన్నాయి. ఈ యుద్ధంలో పేరమరాజు చనిపోయాడు. ఈ పేరమరాజు, విత్తనాలు ఇవ్వడానికి నిరాకరించిన పంటరెడ్డి నాగమ్మకు ఏదో ఒక విధంగా బంధువులు అయ్యుంటారు. వారి మరణం / ఓటమికి కారణమైన తెప్పలి నాయుడు మీద నాగమ్మకు కోపం వచ్చింది. నాగమ్మ తండ్రి పేరు జగ్గారెడ్డి. ఈయన కాకతీయ రాజు మొదటి ప్రతాపరుద్రుడు చేతిలో క్రీ.శ. 1159లో ఓడిపోయిన పొలవాస దేశపాలకుడు రెండవ మేడ రాజు కొడుకు జగ్గదేవుడు అయ్యుంటాడు. ఈ జగ్గదేవుడు తనను శత్రురాజులు (ప్రతాపరుద్రుడితో సహా) ఎవరూ గుర్తు పట్టకుండా ఉండడం కోసం తన పేరును జగ్గారెడ్డిగా మార్చుకుని ఉంటాడు. ఇలా జరగడానికి అవకాశమున్నట్లు కరీంనగర్ జిల్లాలోనే మనకు రెండు శాసనాలు కన్పిస్తాయి. మహదేవపూర్‌లో ‘ప్రతాపగిరికోట’ను కట్టించిన ‘ముచ్చ నాయకుడు’ మనకు రామగుండం మండలం అడవిసోమనపల్లిలో “రామేశ్వరీ దేవరకు” నైవేద్యానకూ ముగ్గునకూ’ పన్నప (భూదానం) చేసినప్పుడు “ముచ్చరడ్డి”గా కన్పిస్తాడు. నిజానికి ఈ రడ్డిలు లేదా రెడ్డిలు మహారాష్ట్ర (మహారట్ట) నుంచి వచ్చినవారు. పలకడంలో రట్ట అనే పదంలట్ట కూడా అవుతుంది. అందుకే వీరి బిరుదుల్లో ఒకటి “లట్టలూరు పురవరాధీశ్వర” ఈ లట్టలూరు మహారాష్ట్రలోని లాతూరు. ఆ ప్రాంతం నుంచి వచ్చిన వారే రట్టలు, రడ్డిలు, రెడ్డిలు. వీరినే తిరెవారు అని కూడా అంటారు. వారి తిరె భాషలో మరాఠీ భాషనే ఎక్కువ వారి ఊర్లే కరీంనగర్ దగ్గరి తిరెపల్లి (5 కి.మీ.) తిరెవెల్లి (25 కి.మీ.) ఈ విధంగా తెలంగాణాలో రెడ్డి కులజులు ప్రవేశించారని అర్థమవుతుంది. ఇది మొదలు తెలంగాణాలో ( నిశాసనాల్లో) రెడ్డి కులస్థులు చాలా మంది కన్పిస్తారు.

Templeపేరమరాజు చనిపోయిన కొన్నాళ్ళకు అతని కొడుకు ఉత్తురుడు స్థానిక రాజులందరిని పోగు చేసి అనుగురాజు మీద యుద్ధానికి సన్నద్ధుడు అవుతాడు. మళ్ళీ యుద్ధం ఆరణిగండ్లలోనే జరుగుతుంది. ఈ ఆరణిగండ్ల (ఆర్మకుండ) క్రీ.శ.1005 నాటికే ఏడు వేల ద్రమ్మల (ఆనాటి కరెన్సీ) ఆదాయం కలిగిన నగరమని దగ్గర్లోని కడపర్తి శాసనంలో ఉంది. కాబట్టే ఇక్కడ స్థానిక రాజులందరూ కూడారు. కాని అనుగురాజు తరపున యుద్ధం చేసిన బ్రహ్మనాయుడి చేతిలో వీరందరూ ఓడిపోయి కప్పం కట్టడానికి ఒప్పుకున్నారు. అయితే యుద్ధం జరుగుతున్న సమయంలో వీరిలో ఎందరో చనిపోయారు కూడా. అలా చనిపోయినవారిలో నాగమ్మ భర్త (సింగారెడ్డి), తల్లిదండ్రులు, అత్తమామలు కూడా ఉన్నారు. అప్పటికి ఆమె పెళ్ళయి రెండు మూడు రోజులే అవుతుంది. ఈ ఘోరానికి కారణమైన బ్రహ్మనాయుడి మీద నాగమ్మకు ద్వేషం పెరిగింది. ఆమె తండ్రి జగ్గారెడ్డి భూమిలో బ్రహ్మనాయుడు బావి తవ్వించి, అందుకు వ్యతిరేకించినందుకు జగ్గారెడ్డిని చంపించాడని, అందుకే బ్రహ్మనాయుడిపై నాగమ్మకు ద్వేషం పుట్టిందని కొన్ని వాదనలున్నాయి. అదీగాక బ్రహ్మనాయుడు వైష్ణవాన్ని ప్రచారం చేశాడని, ఆయన బృందం వెలమలని, వాటికి వ్యతిరేకంగా నాగమ్మ వీరశైవాన్ని ప్రచారం చేసిందని, రెడ్డి కులస్థులను బలపర్చిందని, ఈ కారణాల నేపథ్యంలోనే పల్నాటియుద్ధం జరిగిందని చరిత్రకారులు నమ్ముతున్నారు. కవిబ్రహ్మ ఏటుకూరి వారి క్రింది పద్యంలో ఇందుకు ఆధారాలు కనిపిస్తున్నాయి నాగమ్మ “కట్టించినది కోట గడ్డలకెదురుగా జంగమ వృద్ధుల సత్రశాల…. సృష్టించినది వీరశివభక్తులకుగాను స్థావరమ్మున యందు శైవవీధి” అని చెప్పడంలో ఆమె వీర శైవమతాన్ని పోషించిన విషయం విదితమవుతుంది. పల్నాటి యుద్ధంలో (క్రీ.శ.1180 ప్రాంతంలో జరిగింది) ఎవరు రాజకీయంగా గెలిచినా సామాజికంగా అందరూ ఓడారు. అపార ధన, ప్రాణ నష్టం జరిగింది. అందుకు వెరసి నాగమ్మ తన ముసలితనంలో తన సొంతూరు ఆరెవెల్లికి వచ్చి ప్రజల యోగక్షేమాల సాధనకై కృషి చేసిందని గుర్రం చెన్నారెడ్డి తన ‘పల్నాటి చరిత్ర’లో వ్రాశాడు. అంతేకాదు. “కొండకోనల నివసించు కోయవారు బాటసారుల హింసించు బందిపోటు అక్రమంబగు చర్యల విక్రమింపనణచివేసె నాగమ్మ సాహసము చూపి” అని డా. కోడూరు ప్రభాకరరెడ్డి తన ‘పల్నాటి భారతం’ (పద్యం 85)లో రాయడంలో ఆమె దొంగల నుంచి ప్రజలనెలా రక్షించిందో తెలుస్తున్నది (నేటికీ ఆదిలాబాద్ జిల్లాలలో గొత్తికోయలు సీజనల్ దొంగతనాలను ఆశ్రయించడం గమనార్హం) అందుకే ఆమె దొంగలకు శత్రువుగా మారింది. ఆ సాంప్రదాయం ఎంతవరకు కొనసాగిందంటే, ఆమె తరువాత ఐదు వందల సంవత్సరాల తరువాత విజృభించిన కొండల్రాయుడు అనే గజదొంగ కూడా ఆమెను మాయలమారిగా తలంచాడని బుడిగ జంగాల కథలో చెప్తారు. నాగమ్మకు ‘నా’ అన్న వారు లేరు కాబట్టి “పల్లె ప్రగతికి ధన మెల్ల వ్యయముజేసె’నని సాహిత్యాధారాలు తెలుపుతున్నాయి. ‘ఆమె యొనసరించినట్టి నిస్వార్థసేవ సర్వజనులకు మిగుల హర్షమ్ముగూర్చె” కాబట్టి ఆమెను స్థానికులు దేవతగా కొల్చారు. కనుకనే ఆమెకు ఆమె ఊరు ఆరెవెల్లిలో గుడికట్టారు. అది ఇప్పటికీ ఉంది. ఇక్కడికి దగ్గరలో ఉన్న పొలవాసలో కూడా ఒక స్త్రీ శివలింగాన్ని పట్టుకున్నట్లుగ విగ్రహముంది. అది శివభక్తురాలు నాగమ్మదే అయ్యుంటుంది. పక్క జిల్లా నిజామాబాదు జిల్లా బాన్సువాడ దగ్గరి దుర్కి సోమేశ్వరాలయ గర్భగుడిలో కూడా నాగమ్మ విగ్రహముంది. శాసనాలున్నాయి. వాటిని చదివితే మరిన్ని ఆధారాలు లభించవచ్చు. ఆరెవెల్లిలోని గుడికి తూర్పున నాయకురాలి వాగు, నాయకురాలి మడుగు ఉన్నాయి. వాటిని ఆమె తవ్వించినందుకుగాని, లేదా ఆమె సంక్షేమ కార్యక్రమాలకు గుర్తుగా గాని నాయకురాలు నాగమ్మ పేరుతో పిలుస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా లక్షెట్టిపేట దగ్గరలోని కన్నెపల్లి గుడిల నాగమ్మ విధవలకు, విడిపోయినవారికి మళ్లీ వివాహం జరిపించే సాంప్రదాయాన్ని నెలకొల్పింది. అది ఇప్పటివరకూ కొనసాగుతున్నది. ఇలా నాగమ్మ వచ్చి మండలం అంతటా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఈ విధంగా నాయకురాలు నాగమ్మ తెలంగాణ అందించిన మొట్టమొదటి మహిళా మంత్రిణే కాకుండా, ఆమె ఉత్తర తెలంగాణలో రెడ్డి కులాన్ని, వీరశైవాన్ని ప్రవేశపెట్టినదిగా, దొంగలను, దోపిడీలను పారదోలి ప్రజాసంక్షేమానికి పాటుపడినదిగా చరిత్రలో గుర్తుండిపోతుంది.
 – ద్యావనపల్లి సత్యనారాయణ,
చరిత్రకారుడు, 9490957078.

Saturday 12 November 2016

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )

తేరాల సిద్దేశ్వరస్వామి ( Sidheswara Swamy, Terala )



దుర్గి  మండలంలోని తేరాల గ్రామంలో  భ్రమరాంబ సమేత సిద్దేశ్వర స్వామి ఆలయం ఉంది.      కోరిన కోర్కెలు తీర్చే చల్లని దైవంగా ప్రసిద్ధి చెందిన సిద్దేశ్వరస్వామి ఆలయానికి ఎంతో పురాతన చరిత్ర ఉంది. గంగవల్లి, మల్నాయుడు, నవీననాయుడు, దేవ ర్నాయుడు, సోమనాధ దేవరరాజదీ షులు ఈ ఆలయాన్ని క్రీశ 675 సంవత్సరంలో భాద్రపద బహుళ సూర్యగ్రహణ కాలంలో నిర్మించినట్లు ఇక్కడి శిలాశాసనంలో ఉంది.





పరుశు రాముడు ఈ ఆలయ ప్రాంతంలో తపస్సు చేసి ఇక్కడ గుడి కట్టించాలని సంకల్పం చేశాడు. శివలింగం కోసం వెళ్ళి వచ్చే లోపే సాక్షాత్తు పరమేశ్వ రుడే ఇక్కడ లింగరూపంలో ఆవిర్భివిం చాడని స్ధల పురాణం చెబుతుంది. అంతట పరుశురాముడు శివుడే స్వయం భూ అయిన వైనాన్ని తలుచు కొని ఇది దైవ సంకల్పమని భావించి, పక్కనే తాను తెచ్చిన లింగాకారాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేశాడు. ఇప్పటికీ ఈ ప్రాంత ప్రజలు ఈ దేవా లయంలో శివలింగాలలో ఒక దానిని పుట్టుడు లింగమని, మరొక దానిని పెట్టుడు లింగమని చెప్పుకుంటారు. ఆలయానికి తూర్పు దిశగా వాయు లింగేశ్వరస్వామి, పడమర దిశగా రుద్ర గుండం, దక్షణ దిక్కున తేరాల గ్రామం, ఉత్తరం గో గర్భం అనుస్ధాన గుండం ఉన్నాయి. ప్రస్తుతం తేరాలగా పిలవబడుతున్న పూర్వం బ్రాహ్మణ అగ్రహారంగా పిలుస్తారు. ఇక్కడి బ్రహ్మాణులు నలంద, తక్షశిల వంటి ప్రసిద్ధి పొందిన విశ్వవిద్యాలయాలలో ఆచార్యులుగా పనిచేసినట్లు ఇక్కడి శిలాఫలకం ద్వారా తెలుస్తొంది.



ఈ దేవాలయానికి ఎదురుగా కోనేరు ఉంది. ప్రకృతి సిద్దంగా నీరు ఊరి ప్రవహించే ఐదు బుగ్గలు కలసిన జలం ఈ కోనేరులోకి ఉబికి రావటం విశేషం. ఇది విబూది కోనేరుగా ప్రసిద్ది చెందింది. కోనేరు అడుగు బాగంలో సుద్దతో తయారైన విబూది ఉండలు సహజ సిద్దంగా ఏర్పడుతుంటాయి. ఈ విబూది వుండలను భక్తులు పరమ పవిత్రం భావించి తీసుకెళ్తూ ఉండటం జరుగుతుంది. ఆలయానికి పక్కన గో గర్భము అను సన్నని మార్గముంది. ఈ మార్గమునకు పొడవు, వెడల్పు ఒక అడుగుకు మించి కూడా వుండదు. అయినప్పటికీ పవిత్రమైన మనస్సుతో శివుని స్మరిస్తూ ఎంతటి స్ధూలకాయు లైన ఈ మార్గం ద్వారా తేలికగా వెళ్ళి స్వామి వారిని దర్శించుకొని రావచ్చు. ఈ దారి గుండా దైవ దర్శననాకి వెళ్ళి వస్తే కోరిన కోర్కెలు తీరుతాయని, సంతాన ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాబ విశ్వాసం.



మాచర్ల మండలం రాయవరం  గ్రామ ప్రజలు శ్రీ భ్రమ రాంబ దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి సిద్దేశ్వర స్వామి దేవాలయంలో ప్రతి ష్టించి ఇలవేల్పుగా కొలుస్తూ ప్రతి సం వత్సరం శివరాత్రి పర్వదినాన ఆమెకు పసుపు, కుంకుమ, పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకొని భజనలు, కోలా టాలతో గుడి వద్దకు చేరుకుంటారు. శివరాత్రి రోజు నిర్వమించే శ్రీ భ్రమ రాంబ సమేత సిద్దేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవాలకు పల్నాడు ప్రాంతం నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. 

Friday 29 July 2016

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య ( kavuri Venkaiah )

పల్నాటి విద్యాధాత కావూరి వెంకయ్య


గాంధీయవాదిగా నిరూపించుకున్న కావూరి వెంకయ్య పల్నాటి సీమలోని బడుగు బలహీన వర్గాలకు ఆరాధ్యదేవుడు. కొండ కోనల్లోని గిరిజన, దళిత, బడుగు, బలహీన వర్గాల పిల్లలను చేరదీసి వారిని విద్యాపరంగా అభివ`ద్ది చేసిన ఘనత వారికే దక్కింది. మారుమూల గ్రామల్లొని విద్యార్థుల కోసం పాఠశాలలు, హాస్టళ్లును ఏర్పాటు చేశారు. హాస్టళ్ల నిర్వాహన కొరకు గ్రామగ్రామాన తిరిగి పప్పు ధాన్యాలు, నిత్యవసర వస్తువులు సేకరించి విద్యార్థులకు బోజన ఏర్పాట్లు చేసేవారు. మాచర్లలో చెంచుబాలికల హాస్లళ్లు, కళామందిర్ సెంటర్ లోని చిన్నకాన్వెంట్ కు స్థలాన్ని ఇచ్చారు. నాగార్జనసాగర్ లో చెంచు బాలికల కోసం పాఠశాలను ఏర్పాటు చేశారు. వీటికి తోడు గురజాలలో హయ్యర్ గ్రేడు శిక్షణా కేంద్రాన్ని నెలకొల్పారు. దీంతో పల్నాడులోని బాలబాలికలు దీనిలో శిక్షణ పొంది ఉపాధి పొందారు. కరువు సీమలో విధ్యాభివ`ద్దికి బాటలు వేసిన వెంకయ్య పల్నాటి విద్యాధాతగా వినుతినెక్కారు. మాచర్ల, గురజాల, కారంపూడి, పిడుగురాళ్ల, నాగార్జునసాగర్, కొత్తపుల్లారెడ్డి గూడెం, అలుగురాసుపల్లె తదితర గ్రామాలలో పాఠశాలల ద్వారా పేదవారికి విద్యాదానం చేశారు.

ప్రముఖులతో పరిచయం..

కావూరివెంకయ్య కి ఆనాటి ఎందరో ప్రముఖులతో పరిచయం ఉండేది. ఆ పరిచయం తో
ఆచార్య రంగా, గొళ్లపూడి సీతారామశాస్త్రి, గొపరాజు రామచంద్రరావు(గోరా)లను ఆహ్వానించి వారిచే విద్యార్థులకు సందేశాలు ఇప్పించేవారు. బూర్గుల రామక`ష్ణారావు, మర్రి చెన్నరెడ్డి, వల్లూరి బసవరాజు, కొండవీటి వెంకట రంగారెడ్డి, మాడపాటి హనుమంతరావు మొదలగు నేతలు వెంకయ్యగారి ఆశ్రయంలో గడిపి విధ్యార్థులకు తమ అమూల్య సందేశాలు ఇచ్చేవారు. వావిరాల గోపాలక`ష్ణయ్య తరుచూ వెంకయ్యగారి ఆశ్రమాన్ని సందర్శించి వారి క`షిని అభినందించేవారు. చదువుల వాసన ఎరగని మారుమూల అట్టడుగు పిల్లలను వెలుగులోెకి తెచ్చి వారికి విద్యను అందించారు. ఈయన పాఠశాలల్లో చదివిన ఎందరో విధ్యార్థులు గొప్పగొప్ప ఉద్యోగాలలో ఉన్నారు. ఇప్పటికి ఆయా కుంటుంబాల వారు వెంకయ్య పేరు చెప్పుకొని ఇంటి దీపం పెట్టుకుంటారు. వెంకయ్య అక్షరాల సోషలిస్టు. అందుకే ఆయన నిర్వహించిన పాఠశాలలు, హాస్లళ్లు భవనాలు, స్థలాలు ప్రభుత్వ పరం చేశారు. మాచర్ల ప్రస్తుతం నడుస్తున్న ఆర్ సీ ఎం పాఠశాలను ఆనాడు భననాలతో సహా యాజమాన్యానకి విరాళం అందించారు. విద్యాలయాలుగా ఉన్న స్వంత భవనాలను కూడా ఉచితం ప్రభుత్వ పరం చేసిన త్యాగ ధనుడు వెంకయ్యగారు. 1940 సత్యాగ్రహి, 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్లోని జైలు జీవితం గడిపారు. గాంధీజి పిలుపు మేరకు స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని పల్నాటి కి వెలలేని కీర్తని తీసుకొచ్చారు.