Wednesday 26 November 2014

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో మందపోరు

పల్నాటి వీరారాధన ఉత్సవాల్లో మందపోరు
 పల్నాటి ఉత్సవాల్లో మూడోరోజైన మందపోరు  జరిగింది. బ్రహ్మనాయుడు, మలిదేవరాజు కోడిపోరులో ఓడిపోయి అరణ్యవాసం చేసేందుకు మందాడి గ్రామంలో వెళ్లి అక్కడే స్థిరనివాసం చేసుకుని ఉంటాడు. సుఖశాంతులతో కాలాన్ని గడుపుతాడు బ్రహ్మనాయుడు. నాగమ్మ పసిగట్టి బ్రహ్మనాయుడు వైభవాన్ని జీర్ణించుకోలేక పల్నాడు విడిచిపెట్టి వెళ్లినవారు ఇబ్బందులు పడాలేతప్ప సుఖశాంతులతో ఉండకూడదని నలగామరాజుకు హితభోద చేస్తుంది. బ్రహ్మనాయుడిని ఎలాగైనా వదిలిపెట్టకూడదని మండాది గ్రామంపై దాడి చేసేందుకు పన్నాగం పన్ని అర్థవీడులోని వీధులపర్నిడు చంచునాయకుడితో కుమ్మకై బ్రహ్మనాయుడిపై యుద్ధానికి పంపుతుంది నాగమ్మ. పర్నిడు తండ్రిని బ్రహ్మనాయుడు హతమార్చుతాడు. బ్రహ్మనాయుడు రహస్యంగా ఆవుల మందతో ఆనందంగా ఉంటున్నాడు. లంకన్న గోవులు కాసేందుకు వెళ్తాడు. పర్నిడు ఆవుల మందను చెదరగొట్టి వాటిని గురజాలవైపు తోలుకుని వచ్చి లంకన్న కత్తులు, బడిశలతో దాడి చేస్తాడు. ఓ చెన్నకేశవా, వీర్ల అంకమ్మతల్లి అంటూ బ్రహ్మనాయుడు రాకకోసం ఎదురు చూస్తాడు. బ్రహ్మనాయుడు కన్నమదాసును వారికి ఎదురు దాడికి పంపిస్తాడు. లంకన్నకు బ్రహ్మనాయుడు ప్రాణప్రతిష్ఠ చేస్తాడు. వీరచారవంతులు తమ కొణతములతో గ్రామోత్సవం చేశారు. వీర్ల అంకమ్మదేవాలయం, వీర్ల దేవాలయం, చెన్నకేశ దేవాలయాల్లో ప్రజలు మొక్కు బడులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి తరుణ్ చెన్నకేశవ అయ్యవారు. పీఠం నిర్వాహకులు విజయ్, వీరచారవంతులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment