Showing posts with label Veeraradhna utsav. Show all posts
Showing posts with label Veeraradhna utsav. Show all posts

Monday, 14 November 2016

వీరారాధన ఉత్సవాలు, కారెంపూడి ( Veeraradhna utsav , karempudi)

వీరారాధన ఉత్సవాలు ,  కారెంపూడి


ఈ నెల 28 న  కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి.
పల్నాటి యుద్ధం ముగిసిన తరువాత బ్రహ్మనాయుడు ఆశయసిద్ధి కోసం కారంపూడిలో వీరాచారపీఠము స్థాపించి దాని పీఠాధిపతులుగా పిడుగు వంశం వారిని నియమించారు. అప్పటి నుంచి పల్నాటి వీరోత్సవాలు జరుగుతున్నాయి. కార్తీక పౌర్ణిమి నాడు బ్రహ్మనాయుని న`సింహకుంతము, బాలచంద్రుని సామంతము, కన్నమదాసు భైరవఖడ్గములతో కొంతములను తీసికొని నాగులేరు లో శుభ్రం చేసి, అలంకరణలో గ్రమోత్సవం జరుపుతారు.
ప్రతి ఏడాది కార్తిక మాసం లో పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. ఇది 800 ఏళ్ళ నుంచి కొనసాగుతున్న ఆచారం . ఈ నెల 28 కార్తిక అమావాస్య నుంచి 5 రోజులు పాటు పల్నాటి వీరోత్చావాలు జరుగుతాయి. యుద్ధంలో మరణించిన వీరులకు దైవత్వం అపాదించి వారికి గుడిలు కట్టి వారు ఉపయోగించిన ఆయుధాలు ను పూజించటం అనే సాంప్రదాయం భారతదేశంలో ఒక్క పల్నాడు ప్రాంతం లోనే జరుగుతుంది. వీర్ల సేవాస్థానములుపోతురాజుకు పిడిగెం కట్టడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. కార్తీక అమావాస్య నుంచి వరుసగా ఐదు రోజులు.. రాచగావు, రాయబారం, మందపోటు, కోడిపోరు, కల్లిపాడు అను పేర్లతో ఉత్సవాలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచే గాగ ఇతర రాష్ట్రాలు నుంచి వీరాచార వంతులు తరలివస్తారు. వీర విద్యావంతులు శ్రీనాధని పల్నాటి వీర చరిత్రను ఈ ఐదు రోజుల పాటు గానం చేస్తారు.

► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra