Showing posts with label పల్నాటి యుద్ధం. Show all posts
Showing posts with label పల్నాటి యుద్ధం. Show all posts

Thursday, 8 December 2016

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..

పల్నాటి రాజ్యం కోడిపోరులో.  మాచర్లను  ఏలు బ్రహ్మనాయుని నేతృత్యంలో మలిదేవాదులు, గురజాలను పరిపాలించే నలగామరాజు, మంత్రి నాగమ్మ చేతిలో ఓడిపోయి అరణ్యవాసం చేయగా. మహా భారతంలో పాండవులు ధర్మరాజు నేతృత్వంలో, కౌరవులతో ఆడిన జూదంలో ఓడిపోవటంతో వనవాసం చేయాల్సి వచ్చింది. దీంతో భారతంలోని ఘటనలు. పల్నాటి సంఘటనలు సామరూప్యతక కల్గివుండటంతో. అందుకే దీనిని పల్నాటి మినీ భారతం" గా అభివర్ణించారు. పౌరుషాల పురిటి గడ్డగా ఖ్యాతి గడించిన పల్నాడులో నాయకురాలు నాగమ్మ కుటిల నీతికి దర్పణం 'కోడిపోరు..
అల నాడు మాచర్ల రాజు మలిదేవని సైన్యంలోని అలరాజుకు గురజాల రాజు నలగాముడి కుమార్తెను ఇచ్చి వివాహం సందర్భంలో సరదాగా కోడి పందేలు సాగాయి. ఇది పంతాలకు దారి తీసి నిజమైన కోడిపోరుకు ముహూర్తం ఖరారవుతుంది, దీంతో రెంచింతల మండలంలోని పాలు వాయి వద్ద గల పాడేరు గుట్టల్లో కోడిపోరు నిర్ణయిం చారు. దీంతో గురజాల, మాచర్ల రాజ్యాల్లో పందెపు కోళ్లన్నీ నాగమ్మ కొనేసిన క్రమంలో దేవానుగ్రహంతో బ్రహ్మన్న చిట్టిమల్ల అనే కోడిని సాధిస్తాడు. నిర్ణయిం చిన ప్రకారం కోడిపోరు మొదలవగా రెండుసార్లు బ్రహ్మన్న పంజు పోటీల్లో గెలుపొందుతుంది. దీంతో ఆగ్రహించిన నాగమ్మ మంత్రకట్టు తో   బ్రహ్మన్న కోడి చిట్టి మల్లను నిర్వీర్యం చేసి గురజాల కోడైన సేవంగి డేగ పోరులో గెలిచేలా చేస్తుంది. ఓడిన బ్రహ్మన్న సారథ్యం లోని మాచర్ల రాజులు మలిదేవాదులు అరణ్యవాసం అనుభవిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Wednesday, 7 December 2016

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మంద' పోరు'

మందాడి ఫై నాగమ్మ కన్నుతోనే మందపోరు



కోడి పందెములో ఓడిపోయిన మలిదేవాదులు బ్రహ్మానాయుని నేతృత్యంలో మందాడికి చేరుకొని అక్కడ నివసిస్తుంటారు. మూడేండ్ల తరువాత నాయకురాలు నాగమ్మ మలిదేవాదులు ఎలావున్నారు అన్నవిషయం పై వేగుల ద్వారా వాకబు చేస్తుంది. అక్కడవారు గోసంపద (ఆవులమంద)తో సుఖశాంతులతో జీవిస్తున్నారని తెలుసుకొని ఆమెకు కన్నుగుట్టిం ది.ఏదో విధంగానైనా మలిదేవాదులను చీకాకు పరచాలని నలగామరాజుకు దుర్నితిని కల్లించేలా చేస్తుంది.తొలుత నలగామరాజు అంగీకరించకపోయినా నాయకురాలు నాగమ్మ మాటలకు ప్రలోభపడతారు.దీంతో బ్రహ్మానాయునిపై శతృత్వం పెంచుకొంటారు. మందాడిలో ఆవుల మందతో వుంటున్న బ్రహ్మన్నపై యుద్ధం చేయించాలని సమరుడైన అర్ధవీటిలోని వీధుల పల్నీడు అను చెంచు నాయకున్ని నాగమ్మ కబురు పంపుతుంది. గతంలో పల్నీడు తండ్రిదాబుచేనిని బ్రహ్మనాయుడు ఓయుద్ధంలో ఓడిస్తారు. పగతీర్చుకోవాలని రగిలిపోతున్న ఆతనికి నాగమ్మ పిలుపుతో తన అనుచరులతో పాటు పరివారాన్ని వెంటతీసుకొని గురజాల వెళ్లారు. ఈ కార్యంను విజయవంతంగా పూర్తి చేసుకొని వచ్చే నీకు మాచర్ల రాజ్యాన్నికానుకగా ఇస్తామని చెపుతుంది, దామినీడు,పల్లన్నమల్లన్నఅనేవేగులద్వారా మందాడి పట్టణంలోనికి హరిదాసుల వేషంలో వెళ్లి మలి దేవాదుల ఆవుల మందలపై దాడిచేసేందుకు వ్యూహం పన్నుతారు.ఆవులమందకు కాపలాగా లంకన్నను నాయకుడిగా బ్రహ్మనాయుడు నియమి స్తారు. వీధుల పల్నీడు తన సైనిక బలంతో పాటు నలగామరాజు అందించి సైన్యాన్ని తీసుకొని మూకుమ్మడిగా గోవుల మందలపై దాడిచేస్తారు.ఈ దాడిలో లంకన్న వీరావేశంతో నలగాముని సైన్యాన్నిహతమారుస్తారు.వీధలపల్నీడు పన్నిన పద్మవ్యూహంలో చికుకున్న లంకన్న అభిమన్యునిలాగా వీరోచితంగా ఒంటరి పోరాటంచేస్తూ పల్నీడు తలను తెగనరికిన ఆనందంలోకల్గివుండా నలుమూలల నుంచి చాటుమాటు నుంచి బాణాలను ఒకేసారి వేయటంతో లంకన్న నేలకొరుగుతారు. ఈ విషయాన్ని లంకన్న అనూయయుల్లో మిగిలి వున్నపెయ్యల పేర్నీడు బ్రహ్మనాయునికి  తెలియ జేస్తారు. బ్రహ్మనాయుడు తన మానస పుత్రుడైన మాల కన్నమ దాసును వెళ్ళి మందాడిని రక్షించాల్సిందిగా ఆజ్ఞాపిస్తారు.దీంతో కన్నమదాసు నలగామ రాజు సైన్యాన్ని చెంచుల సేనలను ఓడించి ఆలమందలను రక్షిస్తారు.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Saturday, 3 December 2016

అలరాజు రాయబారం వికటించుటయే.. పల్నాటి యుద్దానికి బీజం.!

అలరాజు రాయబారం వికటించుటయే
పల్నాటి యుద్దానికి బీజం.!





మాచర్లను పరిపాలిస్తున్న బ్రహ్మనాయుడు నేతృత్వంలోని మలిదేవాదులు తమ ప్రాంతాన్ని  అప్పగించాలంటూ గురజాలను పాలిస్తున్న నలగామ రాజును కోరుటకు గాను అలరాజును " (రాయభారం)రి" పంపగా అది కాస్త వికటించటంతోనే పల్నాటి యుద్దానికి తొలి బీజం పడిందని చారిత్రక ఇతి వృత్తాంతం.
మలిదేవాదులు కోడిపందెంలో ఓడిపోవుటతో ముందసుగా జరిగిన ఒప్పందం మేరకు బ్రహ్మనాయుని అనూయులు రాజ్యం వదలి ఏడు సంవత్సరముల వనవాసము పూర్తిచేసుకొని మేడపి ( ప్రకాశం జిల్లా )లో  వుంటున్నారు. గడువు తీరి ఆరునెల కావటంతో రాజ్యాన్ని తిరిగి పొందేందుకు గాను నలగామరాజు అల్లుడు పేరిందేవి భర్త "అలరాజు" ను గురజాలకు బ్రహ్మనాయుడు "రాయభారం" పంపుతాడు. అలరాజును  రాయభారం పంపే సమయంలో అతని తల్లి  బ్రహ్మనాయునితో  వీరాగ్రేసులైన పెద బాలరాజునుగాని, నీ మాసన పత్రుడైన సర్వసైనాధ్యక్షులు మాల కన్నమదాసు, నీ కుమారుడు బాలచంద్రుడ్నిగాని పంపంవచ్చగా అని పేర్కొంటుంది. కోడి పందెములో గురజాల వారు చేసిన మోసమును, దుర్మాగమును తెలిసి కూడా ధర్మం పేరిట న్యాయం పేరిట మనలను ఓటమి అంగీకరించమన్నప్పుడు నిష్పక్షపాతంగా వ్యవహరించిన ధర్మమూర్తి అలరాజు అని బ్రహ్మనాయుడు కొనియాడతాడు. అలరాజుకు అంగరక్షకుడిగా కన్నమదాసు ను పంపటమే కాకుండా మహీన్వితమేన 'తులసి మాలను వేసి గురజాలకు రాయభారం వంపుతానని బ్రహ్మనాయుడు తెలపటంతో అలరాజు తల్లి వెళ్ళేందుకు అంగీకరిసుంది. రాయభారమునకు వెళ్ళిన వారు మార్గమధ్యలో కందేరు వాగు దాటవలసివస్తుంది. ఆ మార్గంలోనే బాలచంద్రుడు అటుగా వస్తాడు. ఆ ఇరువరు ఏరు దాటువిషయంలో సరదాగా పందేం కాసారు. ఓడిన వారు నిలువ దోపిడి గావించాలని షరతు. పందేంలో అలరాజు ఓడిపోవుటతో నిలువ దోపిడిగా అన్ని అభరణములతో పాటు తులసిమాలను కూడా తీసాడు. తదుపరి అలంకరణ పూర్తి చేసుకొనిన అలరాజు తులసిమాలను మర్చిపోయి గురజాలకు బయలుదేరుతారు. 'నరసింగరాజు" నాగమ్మలు దౌత్యమునకు సహకరించకపోగా "సూదిమోపినంత నేల కూడా ఇవ్వమని నలగామరాజు క్రోపోద్రేకము వ్యక్తం చేస్తాడు. దీంతో సహనానికి విలువలేకుండా పోయింది. పల్నాట రక్తము ఏరులై పారవలసిందే నంటూ అలరాజు యుద్ధ ప్రకటన చేస్తూన్నాను సిద్దంకండీ. విజయమో. వీరస్వర్గమో. తెల్చుకుందాం...! అని తన "సూర్య భేతాళ ఖడ్గము" ను తీసి వీరావేశమును ప్రదర్శించేను. రాయబారిగా వచ్చాన్నవిషయం గురు_కువచ్చి ఎత్తిన ఖడ్గమును దించకూడదన్న నియమము చేత సభలోని స్తంభమును తెగనరికి వెను తిరుగుతారు. మార్గ మధ్యలో చర్లగుడిపాడు సమీపాన నాయకురాలు నాగమ్మ కుతంత్రంములతో తంబళ్ళజీయర్ ద్వారా అలరాజును విష ప్రయోగం చేత చంపిస్తుంది. ఈ సంఘటనతో ఆగ్రహం వ్యక్తం చేసిన బ్రహ్మనాయుడు యుద్ధ ఆసన్నమైందని ప్రకటన  చేస్తారని చారిత్రక కధనం.
► follow us@ fb.com/palnaticharitra
► follow us@ http://palnaducharitra.blogspot.in/
► Subscribe Our Channel: www.youtube.com/palnaticharitra

Friday, 5 December 2014

పల్నాటి యుద్దం సినిమా

పల్నాటి యుద్ధం



కొత్త చిత్ర నిర్మాణ సంస్థలు ప్రారంభం కావడం, ఉమ్మడి మద్రాసు ప్రభుత్వం పెంచిన వినోదపు పన్ను భారం అవుతోందని, నిర్మాణ వ్యయం కూడా పెరిగిపోయిందని భావించిన పాత నిర్మాణ సంస్థలు కొన్ని తెలుగు చిత్రాలు నిర్మించడం ఆపి, తమిళంలో చిత్రాలు నిర్మించడానికి సంకల్పించడం, రెండు స్టూడియోలను తెలుగువారు ప్రారంభించడం, విజయవాడలో నవయుగ ఫిలింస్‌ పంపిణీ సంస్థ ప్రారంభించడం 1947లోని ముఖ్యమైన విశేషాలు. ఈ ఏడాది పల్నాటియుద్ధం, యోగి వేమన, బ్రహ్మరథం, గొల్లభామ, రత్నమాల, రాధిక చిత్రాలు నిర్మించగా రత్నమాల తప్ప మిగతా చిత్రాలు విడుదల అయ్యాయి. వీటిలో యోగి వేమన పల్నాటి యుద్ధం, గొల్లభామ చిత్రాలకు పేరొచ్చింది. 1947 ఆగస్టు 15న మన దేశం బానిస శృంఖలాలనుండి విడివడి స్వతంత్రదేశంగా అవతరించడంతో దర్శక నిర్మాతలు సాంఘిక సమస్యలకు చిత్ర ఇతివృత్తాలు ప్రాధాన్యత యిచ్చే ప్రయత్నం వెంటనే ప్రారంభించారు.
చిత్ర దర్శకుడుగా తరువాత మారి మంచి చిత్రాలు రూపొందించిన వేదాంతం రాఘవయ్య ఈ ఏడాది విడుదలైన యోగివేమన, పల్నాటియుద్ధం చిత్రాలకు నృత్య దర్శకత్వం నిర్వహించడం విశేషం.
భానుమతి, రామకృష్ణ దంపతులకు జన్మించిన పుత్రుడు భరణి పేరున భరణి పిక్చర్స్‌ నిర్మాణ సంస్థను భానుమతి ప్రారంభించి 'రత్నమాల' చిత్రాన్ని భర్త రామకృష్ణ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం ప్రారంభించారు.
పల్నాటి యుద్ధం
సహాయ సంపాదకుడుగా పనిచేసి, ప్రజామిత్రకు సంపాదకుడుగా వ్యవహరించిన గూడవల్లి రామబ్రహ్మం సినీరంగంలో ప్రొడక్షన్‌ ఎగ్జిక్యూటివ్‌గా, పబ్లిసిటీలో సలహాలు యిచ్చేవానిగా వ్యవహరిస్తూ 'మాలపిల్ల' చిత్రానికి దర్శకులై, ఆ చిత్ర విజయంలో 'రైతుబిడ్డ' రూపొందించారు. 'రైతుబిడ్డ' కొందరు జమీందార్ల ఆగ్రహానికి బలి అయింది. తరువాత ఆ ధోరణి చిత్రాలు మాని 'ఇల్లాలు, అపవాదు, పత్ని, పంతులమ్మ, మాయాలోకం' చిత్రాలు రూపొందించారు. వీటిలో కొన్ని బయట సంస్థలు నిర్మించిన చిత్రాలు. 'పల్నాటియుద్ధం' రూపొందించాలనే కోరిక చాలా కాలంగా వుండేది. 'పల్నాటియుద్ధం' ప్రారంభించిన తరువాత అనారోగ్యం ఏర్పడింది. కొంత భాగం షూటింగ్‌ చేసాక ఈ చిత్రం పూర్తి చేసే బాధ్యతను ఎల్‌.వి.ప్రసాద్‌కి అప్పగించారు. గూడవల్లి రామబ్రహ్మం అక్టోబర్‌ 1946లో మరణించారు. మరణానంతరం 'పల్నాటియుద్ధం' సెప్టెంబర్‌ 47లో విడుదల అయింది. 'పల్నాటియుద్ధం' చిత్రం రూపొందించాలన్న ఆలోచన చాలా కాలం నుంచి గూడవల్లికి ఉన్నందున పల్నాటియుద్ధం బుర్రకథలను విని, అందుకు సంబంధించిన గ్రంథాలను చదివి, స్క్రిప్టు తయారు చేయించారు. బ్రహ్మనాయుడుగా డా. గోవిందరాజుల సుబ్బారావు, నలగామరాజుగా శ్రీవత్స వెంకటేశ్వరరావు, నరసింగరాజుగా లింగమూర్తి, బాలచంద్రుడుగా అక్కినేని నాగేశ్వరరావు, నాగమ్మగా కన్నాంబ, మాంచాలగా ఎస్‌.వరలక్ష్మి, కొమ్మరాజుగా గిడుగు సీతాపతి, మలిదేవరాజుగా సదాశివరావు, అలరాజుగా కోనేరు కుటుంబరావు, కన్నమదాసుగా వి. కోటేశ్వరరావు, సుబ్బన్నగా వంగర, రాజనర్తకిగా రాజబాల, పేరమ్మగా చంద్రకళ, ఐతాంబగా జి. విశ్వేశ్వరమ్మ నటించారు.
శ్రీ శారదా ప్రొడక్షన్స్‌ పతాకాన గూడవల్లి రామబ్రహ్మం నిర్మించి, కొంత చిత్రాన్ని దర్శకత్వం చేసి పక్షవాతం పాలవడంతో మిగతాది ఎల్‌.వి.ప్రసాద్‌ పూర్తి చేసారు. గూడవల్లి అనారోగ్యం కారణంగా బావమరిది కోగంటి వెంకట సుబ్బారావు నిర్మాణ బాధ్యతను చేబట్టారు. రామబ్రహ్మం, శారద దంపతులకు అంకితమిచ్చారు 24-9-47న విడుదల చేస్తూ.
బ్రహ్మనాయుడు వీరవైష్ణవుడు. నాగమ్మ వీర శైవ మతస్థురాలు. నాగమ్మ దురభిమానం 'పల్నాటియుద్ధం'కి కారణమౌతుంది.
పల్నాటిసీమ నలగామ రాజు పాలనలో వుంటుంది. నలగామరాజు సవితి తమ్ముళ్ళు నరసింగరాజు, మలి దేవరాజు. మలి దేవరాజుకు బ్రహ్మనాయుడు అంటే అపారమైన అభిమానం. పల్నాటి సీమలో అందరికీ బ్రహ్మనాయుడు అంటే అభిమానము అతని మాట వేదవాక్కు. బ్రహ్మనాయుడు మాచర్ల చెన్నకేశవ ఆలయంలో హరిజనులకు ప్రవేశం కల్పించడం, నిమ్నజాతికి చెందిన కన్నమదాసుని సైన్యాధికారుని చేయడంతో అగ్రవర్గాల లతో పాటు నాగమ్మకూడ కోపం వస్తుంది. బ్రహ్మనాయుడు మీద నాగమ్మ రాజసభలో ఆరోపణలు చేస్తే బ్రహ్మనాయుడు బదులివ్వక సభ వదలి వెళ్ళిపోతాడు. మలిదేవుడు బ్రహ్మనాయుడుతో వెళ్ళిపోతూ రాజ్యాన్ని పంచమనడంతో మాచెర్ల సీమను మలిదేవునికి ఇస్తాడు నలగామరాజు. మాచర్లను బ్రహ్మనాయుడు సహకారంతో పాలిస్తున్న మలిదేవుడుని చూసిన నాగమ్మకు కోపం తారాస్థాయికి చేరుతుంది. కోడిపందాలు పెట్టించి మలి దేవుణ్ణి ఓడిస్తుంది. ఫలితంగా ఏడేళ్ల వనవాసం చేయాల్సి వస్తుంది. వనవాసం అయ్యాక రాజ్యం కోరితే, నాగమ్మ ప్రేరణతో రాయబారి అలరాజు హత్యకు గురి అవుతాడు. యుద్ధం ప్రారంభమవుతుంది. బ్రహ్మనాయుడు కుమారుడు బాలచంద్రుడు భార్య మాటలతో యుద్ధరంగానికి వెళ్లి అలరాజుని చంపిన నరసింగరాజు తల నరుకుతాడు. ఇందులో సతీసహగమనం కూడా వుంది.
బాలచంద్రుడు మరణంతో బ్రహ్మనాయుడు చెలరేగిపోతాడు. పల్నాడు వల్లకాడుగా మారిపోవడంతో పశ్చాత్తాపం ఏర్పడుతుంది బ్రహ్మనాయుడు, నాగమ్మలకు.
'ఎవరవయా దేవా, తానా పంతము నాతోనా, ఝణఝణ కాలాంతకి', పాటలను కన్నాంబ, 'చందమామా ఓ చందమామా', 'ఈ కుహురాత్రి నా రాజు వేంచేయునా', 'రణములో తొడగొట్టి రాగోల బట్టి', 'రతిరాజ సుందరా, రణరంగ ధీరా' పాటలను ఎస్‌.వరలక్ష్మి మేత దారినబడ్డ మేలంపుటావ్‌, తీరిపోయనా... మాతా...' పాటలను ఘంటసాల, 'తెర తీయగా రాదా దేవా' పాటను ఘంటసాల, కన్నాంబ, 'చూతము రారయ్యా, చెన్నమ్మను' పాటను ఘంటసాల, అక్కినేని, వచ్చునటే రాజూ పాటను ఉడుతా సరోజిని, నేడే నిజమురా పాటను సుందరమ్మ ఓహో చారుశీలా పాటను అక్కినేని, ఎస్‌.వరలక్ష్మి ఆలపించారీ చారిత్రక చిత్రంలో.
మాటలు పాటలు సముద్రాల రాఘవాచార్య, సంగీతం గాలి పెంచల నరసింహారావు, ఛాయాగ్రహణం జితేన్‌ బెనర్జీ, సౌండ్‌ దిన్షా కె టెహ్రాని, కళ నాగూర్‌, ఎస్‌.వాళి సమకూర్చారు.
గొల్లభామ
మీర్జాపురం రాజా శ్రీ శోభనాచల గొల్లభామ సి. పుల్లయ్య దర్శకత్వంలో 'గొల్లభామ' చిత్రాన్ని నిర్మించారు. కృష్ణవేణి, ఈలపాట రఘురామయ్య ఈ చిత్రంలోని ముఖ్య పాత్రధారులు. దాసరి కోటిరత్నం, లీలాబాయి, సుందరమ్మ, గంగారత్నం, రామిరెడ్డి, వెల్లంకి, తీగల, రేలంగి, ఎ.వి.సుబ్బారావు, కోటేశ్వరరావు, మల్లికార్జునరావు, కె.వి.సుబ్బారావు, రామమూర్తి మిగతా పాత్రలు పోషించారు.
సంగీతం ఎస్‌.బి.దినకర్‌ రావు, ఛాయాగ్రహణం కొట్నిస్‌, కళ శర్మ, ప్రొడక్షన్‌ బి.ఎ.సుబ్బారావు నిర్వహించారు.
రాధిక
ఆర్‌. బాలసరస్వతి, పద్మనాభరావు ముఖ్యపాత్రలు పోషించిన 'రాధిక' చిత్రాన్ని శ్రీ ఛత్రపతి పతాకాన ఆర్‌.పార్థ సారథి నాయుడు నిర్మించారు. కాళ్ళకూరి సదాశివరావు ఈ చిత్రానికి దర్శకుడు. అంతకుముందు చింతామణి, కుచేల, సులోచన, లంకా దహనం చిత్రాలను డైరక్ట్‌ చేసారు కాళ్ళకూరి సదాశివరావు.
బ్రహ్మరథం
భక్త మార్కండేయ, మైరావణ, దక్షయజ్ఞం, భక్త ప్రహ్లాద, సంసారనారది చిత్రాలకు దర్శకత్వం నెరపిన చిత్రపునారాయణ మూర్తి దర్శకత్వంలో శ్రీ వెంకట్రామా పతాకాన 'బ్రహ్మరథం' చిత్రం నిర్మించారు. అద్దంకి, జయమ్మ ఈ చిత్రానికి ముఖ్య పాత్రధారులు.
సోర్స్- ఆంధ్రప్రభ న్యూస్,   వి.ఎస్‌.కేశవరావ్‌